Sunday, April 28, 2024

తెలుగులో రూ.50 కోట్ల దిశగా దూసుకుపోతున్న ‘కాంతార’

- Advertisement -
- Advertisement -

‘కాంతార’ సినిమాను తెలుగు ప్రేక్షకులకు ఇంత గొప్పగా ఆదరిస్తారని అస్సలు ఊహించలేదని అన్నారు చిత్ర హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి. ‘కాంతార’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సందర్భంగా రిషబ్ శెట్టి మాట్లాడుతూ “ఈ సినిమా 2 వారాల్లో 45 కోట్లు వసూళ్లు సాధించి 50 కోట్ల వసూళ్లకు చేరువవ్వడం ఆనందంగా ఉంది. తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎప్పటికీ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ముందు ముందు ప్రేక్షకులు మెచ్చే, నచ్చే విధంగా సినిమాలు చేసేందుకు కృషి చేస్తాను” అని తెలిపారు.

Rishab Shetty about Telugu Audience over Kantara blockbuster

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News