Saturday, April 27, 2024

ఇడికి రోహిత్ లేఖ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సిఎం కెసిఆర్‌తో ఎంఎల్‌ఎ పైలట్ రోహిత్ రెడ్డి సమావేశం ముగిసింది. రోహిత్ ప్రగతి భవన్ నుంచి వెళ్లిపోయాడు. ఇవాళ ఇడి విచారణకు రోహిత్ రెడ్డి హాజరుకావడంలేదు. ఇడి ఆఫీస్‌కు రోహిత్ రెడ్డి పిఎ శ్రవణ్ కుమార్ వచ్చారు. విచారణకు హాజరు కావడానికి మరి కొంత సమయం కావాలని పిఎం ద్వారా ఇడికి రోహిత్ లేఖ రాశారు. ఇడికి రోహిత్ రాసిన లేఖ పిఎ శ్రవణ్ కుమార్  ఇచ్చి వెళ్లిపోయాడు. రోహిత్ రెడ్డి లేఖపై ఇడి అధికారులు ఎలా స్పందిస్తారు? అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 25 వరకు ఇడిని పైలెట్ రోహిత్ రెడ్డి గడువు కోరారు.  సమాచారం ఇచ్చేందుకు మరింత సమయం కావాలని ఇడికి పిఎ ద్వారా వినతి పత్రం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News