Friday, May 3, 2024

రోహిత్ హాఫ్ సెంచరీ… టీమిండియా 93/3

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు మొదటి ఇన్నింగ్స్ తొలి రోజు టీమిండియా 25 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 93 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. రోహిత్- జడేజా మూడో వికెట్‌పై 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్(10), రజత్ పాటీదర్(5), శుభ్‌మన్ గిల్(0) పరుగులు చేశారు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(52), రవీంద్ర జడేజా(24) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ రెండు వికెట్లు, టామ్ హార్ట్‌లే ఒక వికెట్ తీసి ఔటయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News