ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్య
ముంబై : అన్నిటికీ చైనాపై ఆధారపడడం పెరిగితే భవిష్యత్తులో చైనా ముందు మోకరిల్లక తప్పదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆదివారం వ్యాఖ్యానించారు. 75 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ముంబై లోని స్కూలులో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత ఆయన ప్రసంగిస్తూ స్వదేశీ అంటే విదేశాలకు సంబంధించిన ప్రతీదీ వదులు కోవాలని అర్థం కాదని, స్వదేశ ప్రయోజనాలు దెబ్బతినకుండా కొన్ని షరతులపై అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగాలని ఆయన అభిప్రాయ పడ్డారు. మనం ఇంటర్నెట్ను , టెక్నాలజీని వాడుతున్నామని, కానీ మనదగ్గర వాటికి సంబంధించిన అసలు టెక్నాలజీ లేదని పేర్కొన్నారు. అందుకోసం ఇతర దేశాలపై ఆధారపడుతున్నామని చెప్పారు. స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని సూచించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సంతోషానికి, ఆర్థిక భద్రత ముఖ్యమని, వికేంద్రీకృత ఉత్పత్తి వ్యవస్థతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని సూచించారు. ప్రభుత్వం ఈ దిశగా పరిశ్రమ రంగానికి దిశానిర్దేశం చేయాలని కోరారు.
RSS Chief Mohan Bhagwat Hoisting National Flag