Saturday, May 11, 2024

అఫ్గాన్ పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నాం: పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

Pak closely watching evolving Afghan situation

ఇస్లామాబాద్: పొరుగున అఫ్గానిస్థాన్‌లో జరుగుతున్న పరిణామాలను సన్నిహితంగా గమనిస్తున్నామని పాకిస్థాన్ తెలిపింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లోకి తాలిబన్లు ప్రవేశిస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పాక్ అధికార ప్రతినిధి జహీద్‌హఫీజ్ చౌదరి స్పందించారు. రాజకీయ పరిష్కారానికి తమ మద్దతు కొనసాగుతుందని జహీద్ తెలిపారు. కాబూల్‌లోని పాక్ రాయబార కార్యాలయం పాకిస్థానీయులు, అఫ్గాన్‌వాసులు, అంతర్జాతీయ దౌత్యవేత్తలకు తమ సహకారాన్ని విస్తరిస్తుందని జహీద్ తెలిపారు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ విభాగం ద్వారా వారిని అక్కడి నుంచి తరలించే యోచనలో ఉన్నట్టు జహీద్ తెలిపారు. అఫ్గానిస్థాన్‌లోని మొత్తం 34 రాష్ట్రాల్లో 28 ఇప్పటికే తాలిబన్ల కైవసమైనట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News