- Advertisement -
తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో వేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఆమేరకు గత ఆరు రోజులుగా నిధులను జమచేస్తూనే ఉంది. ఇప్పటి వరకు 66 లక్షల 19 వేల మంది రైతులకు ఒక కోటి 26లక్షల ఎకరాల సాగు భూములకు రైతు భరోసా నిధులు అందడంతో రైతన్నలు సంబురపడుతున్నారు. వాన కాలం పంట సాగుకు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.7770.83 వేల కోట్లు విడుదల చేసినట్లు అధికారులు వెల్లడించారు.
- Advertisement -