Friday, April 26, 2024

సయీకి లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Saiee Manjrekar into Tollywood

 

తన తొలి చిత్రం ‘దబాంగ్ 3’లో తనదైన నటన, అందచందాలతో కట్టి పడేసింది సయీ మంజ్రేకర్. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించి హీరోయిన్‌గా ఆమె మంచి పేరు తెచ్చుకుంది. ‘దబాంగ్ 3’ రిలీజ్ సమయంలో ఈ అమ్మడు మెగా కాంపౌండ్‌లో అడుగు పెట్టనుందన్న టాక్ కూడా వినిపించింది. చరణ్ లేదా బన్నీ సరసన నటించే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే అంతకంటే ముందే సయీ టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ప్రస్తుతం అడివి శేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మేజర్’ చిత్రంలో సయీ మంజ్రేకర్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రం సమ్మర్ రిలీజ్ కోసం సిద్ధమవుతోంది. తాజా సమాచారం ప్రకారం స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్ కోసం సయీ మంజ్రేకర్‌తో మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. వచ్చే ఏడాది నుంచి ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్తుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News