- Advertisement -
లండన్: వింబుల్డన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత స్టార్ జోడీ సానియా మీర్జా రోహన్ బోపన్నలు మూడో రౌండ్కు దూసుకెళ్లారు. శనివారం బ్రిటన్ జోడీ ఎయిడన్ మెక్హగ్, ఎమిలీ వెబ్లీస్మిత్లతో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్లో సానియాబోపన్న జోడీ 6 3,61 స్కోరుతో సునాయాసంగా విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభంనుంచే ప్రత్యర్థి జంటపై ఆధిపత్యం కొనసాగించిన భారత వెటరన్ జోడీ వరస సెట్లలో ఓడించింది. కాగా మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ బార్టీ, పురుషుల సింగిల్స్ విభాగంలో మెడ్వెడేవ్లు ప్రీక్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్నారు.
- Advertisement -