- Advertisement -
హైదరాబాద్: భాగ్యనగరంలోని మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీస్ దగ్గర ప్రైవేటు సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సెక్యూరిటీ గార్డు మధు ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు నల్లగొండ జిల్లా నేరుడు చర్ల మండలం బత్తులపాలెం వాసిగా గుర్తించారు. మహంకాళి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక సమస్యలా లేక కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయం తెలియాల్సి ఉంది.
- Advertisement -