- Advertisement -
ఢిల్లీ: భారత్లో రోజు రోజుకు కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో ఇండియాలో 46,963 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 470 మంది మృతి చెందారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్లో కరోనా కేసుల సంఖ్య 81.84 లక్షలకు చేరుకోగా 1,22,111 మంది మరణించారు. ప్రస్తుతం కరోనా వ్యాధి నుంచి 74.91 లక్షల మంది కోలుకోగా 5.7 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. కరోనా కేసుల విషయంలో అమెరికా (94.02 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా భారత్ (81.84 లక్షలు), బ్రెజిల్(55.35 లక్షలు), రష్యా(16.18 లక్షలు), ఫ్రాన్స్(13.67 లక్షలు), స్పెయిన్ (12.64) లు ఉన్నాయి. కరోనాతో మృతి చెందిన దేశాలలో అమెరికా (2.36 లక్షలు) తొలి స్థానంలో ఉండగా రెండో స్థానంలో బ్రెజిల్(1.59 లక్షలు), మూడో స్థానంలో భారత్ (1.22 లక్షలు) లు ఉన్నాయి.
- Advertisement -