అక్కినేని అఖిల్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. నిజానికి ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా షూటింగ్ నిలిచిపోయి వాయిదా పడింది. ఇదిలాఉండగా ఈ లవ్ అండ్ ఫ్యామిలీ సినిమాలో అఖిల్ తల్లిగా సీనియర్ నటి ఆమని నటిస్తోంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం అంటే 1995లో అఖిల్ బుడిబుడి అడుగులు వేస్తూ నటించిన ‘సిసింద్రీ’ సినిమాలో కూడా ఆమని తల్లిగా నటించింది.
ఈ నేపథ్యంలో 25 ఏళ్ల తర్వాత అఖిల్ తల్లిగా ఆమని నటిస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మరో విషయం ఏమంటే.. అఖిల్, ఆమని మధ్య నడిచే సన్నివేశాలకు ‘సిసింద్రీ’ సీన్లను రిఫరెన్స్గా తీసుకున్నారని టాక్. అయితే ఆమని మళ్లీ అఖిల్ సినిమా హిట్ కావడానికి తనవంతు పాత్ర పోషిస్తుందని చిత్రయూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా పూజాహెగ్డే నటిస్తుండగా గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.