Thursday, May 2, 2024

కీలక పాత్రల్లో ఎవర్ గ్రీన్ తారలు

- Advertisement -
- Advertisement -

యువ హీరో శర్వానంద్. – లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. టాలెంటెడ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. టైటిల్‌తోనే ఈ సినిమాలో ఫిమేల్ క్యారెక్టర్స్‌కు మంచి ప్రాధాన్యత ఉంటుందని చెప్పకనే చెప్పారు. ఇక ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే టైటిల్ అన్ని వర్గాల నుండి మంచి స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఇది బాగా కనెక్ట్ అయిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ఓ ఆసక్తికరమైన ప్రకటనతో వచ్చింది. ఎవర్ గ్రీన్ నటీమణులు ఖుష్బూ, – రాధిక శరత్ కుమార్, ఊర్వశి ఈ ప్రాజెక్ట్‌లో భాగం అవుతున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో చాలా కీలకమైన మూడు మహిళా పాత్రల కోసం ముగ్గురు అత్యంత ప్రతిభావంతులైన నటీమణులను ఎంపిక చేసుకున్నారు కిషోర్ తిరుమల. ఈ ప్రత్యేకమైన చిత్రంలో ఈ ముగ్గురు చాలా ప్రత్యేక పాత్రల్లో కనిపించడం కన్నుల పండుగగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఖుష్బూ, – రాధిక శరత్ కుమార్, ఊర్వశి కూడా షూట్‌లో చేరినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News