Sunday, May 5, 2024

బ్యాంకులు, ఆర్‌ఐఎల్ దన్ను

- Advertisement -
- Advertisement -
Sensex rises 403 points to hit record
403 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

ముంబై : ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలను నమో దు చేశాయి. మెటల్, ఫార్మా, బ్యాంక్స్, పవర్ స్టాక్స్ లాభపడ్డాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 403 పాయింట్లు పెరిగి 55,958 పాయింట్లకు చేరింది. ఇక నిఫ్టీ 128 పాయింట్లు లాభపడి 16,624 పాయింట్ల వద్ద ముగిసింది. బజాజ్ ఫిన్‌కార్ప్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్లుగా నిలిచాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. రంగాల వారీగా చూస్తే ఐటి, ఎఫ్‌ఎంసిజి మినహా మిగతా అన్ని రంగాలు లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్ షేరు సరికొత్త గరిష్ఠానికి చేరుకుని ఆఖరి నష్టపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News