Sunday, April 28, 2024

కొవిషీల్డ్ టీకా ధరలు ప్రకటించిన సీరం సంస్థ

- Advertisement -
- Advertisement -

Serum Institute fixes Covishield price

పుణె: సీరం సంస్థ కొవిషీల్డ్ టీకా ధరలను బుధవారం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలకు టీకాల‌ను రూ.400 చొప్పున సరఫరా చేయనున్నట్టు సీరం ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఇవొ ఆధార్ పూనావాలా పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు రూ. 600 చొప్పున టీకా విక్రయిస్తున్నట్టు ఆయన తెలిపారు. ట్విట్టర్ ద్వారా సీరం సంస్థ ఈ ప్రకటన జారీ చేసింది. వ్యాక్సిన్ల ఉత్ప‌త్తిలో ఉత్ప‌త్తిలో వేగం పెంచాలంటూ కేంద్ర ఆరోగ్య‌శాఖ సూచ‌న‌ను సీరం స్వాగ‌తించింది. మరో నాలుగైదు నెలల్లో రిటైల్ స్టోర్లలోనూ టీకాలను విక్రయించనున్నట్టు సిరం సిఇవొ వెల్లడించారు. ప్ర‌తి ఒక్క‌రికి సాయం చేయడానికి తాము సిద్దంగా ఉన్నామ‌ని, కాస్త స‌మ‌య‌మ‌నం పాటించాలని ఆయన ప్రజలను కోరారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News