Sunday, May 5, 2024

కరోనాతో సిఎన్ రావు కన్నుమూత

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ సిఎన్ రావు కన్నుమూశాడు. టాలీవుడ్ నిర్మాత చిట్టీ నాగేశ్వర రావుకు కరోనా వైరస్ సోకడంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగులో మా సిరిమల్లె, అమ్మా నాన్న లేకుంటే, బ్రహ్మానందం డ్రామా కంపెనీ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. తమిళంలో ఊరగా అనే సినిమా నిర్మించారు.

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సంయుక్త కార్యదర్శి, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి కార్యవర్గ సభ్యుడు, తెలుగు చలన చిత్ర నిర్మాతల సెక్టార్‌ సెక్రటరీగా, సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ అఫ్‌ కామర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా సేవలందించారు. గతంలో ఫిల్మ్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యునిగానూ పని చేసిన అనుభవం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News