Wednesday, May 1, 2024

ఈ క్రిస్మస్ మాత్రం మనదే

- Advertisement -
- Advertisement -

Shyam Singha Roy Royal Event‌

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌లు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీని ఈనెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా వరంగల్‌లో ఏర్పాటు చేసిన ‘శ్యామ్ సింగరాయ్’ రాయల్ ఈవెంట్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. “వరంగల్‌లో ఏది పెట్టినా సక్సెస్ అవుతుంది. ఇక్కడ ఏ సినిమా తీసినా హిట్ అవుతుంది. సినీ పరిశ్రమకు నా వంతు సాయం చేస్తాను” అని అన్నారు.

దిల్ రాజ్ మాట్లాడుతూ “దర్శక నిర్మాతలు కొత్తవారైనా కూడా నాని ఈ సినిమాను తన భుజ స్కంధాల మీద మోశారు. మా ‘ఫిదా’ హీరోయిన్ సాయి పల్లవి ఏ సినిమాలోనైనా అద్భుతంగా నటిస్తారు. మళ్లీ సాయి పల్లవి మ్యాజిక్ చేస్తారు”అని తెలిపారు. నాని మాట్లాడుతూ.. “శ్యామ్ సింగ రాయ్ సినిమాను చూసి ప్రేక్షకులు ఎంతో సంతృప్తిగా ఫీలవుతారు. క్రిస్మస్ మాత్రం మనదే అని ఎంతో గర్వంగా చెబుతున్నాను. రాహుల్‌కి టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అయ్యే సత్తా ఉంది. నిర్మాత వెంకట్‌తో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఉంది. సిరివెన్నెల సీతారామశాస్త్రి తన చివరి పాట ‘శ్యామ్ సింగ రాయ్’ కోసం రాయడంతో ఈ సినిమా మరింత ప్రత్యేకంగా మారింది” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్లు సాయి పల్లవి, కృతి శెట్టి, రాహుల్ సంకృత్యాన్, వెంకట్ బోయనపల్లి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News