Tuesday, May 21, 2024

ఆల్ టైం రికార్డ్ గా సింగరేణి నికర లాభాలు

- Advertisement -
- Advertisement -
2022 -23 లో లాభాలు రూ.2,222 కోట్లు
ప్రకటించిన సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్
తెలంగాణ రాకపూర్వంతో పోలిస్తే 430 శాతం వృద్ధి
గత ఏడాదితో పోలిస్తే 81 శాతం వృద్ధి
కోల్ ఇండియాతో సహా మహారత్న కంపెనీలు అన్నిటికన్నా లాభాల వృద్ధిలో సింగరేణిదే నెంబర్ వన్ స్థానం

హైదరాబాద్ : సింగరేణి సంస్థ 2022 -23 ఆర్థిక సంవత్సరంలో తన చరిత్రలోనే అత్యధికంగా 33,065 కోట్ల్ రూపాయల టర్నోవర్ తో రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించి సరికొత్త రికార్డు సృష్టించింది. శుక్రవారం సంస్థ సిఎండి ఎన్. శ్రీధర్ ఈ వివరాలను ప్రకటిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా అధికోత్పత్తికి కృషి చేసి అత్యధిక టర్నోవర్, లాభాలు సాధించిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులు, యూనియన్ నాయకులకు తన అభినందనలు తెలియజేశారు.

వివరాలు ఈ విధంగా ఉన్నాయి. సింగరేణి సంస్థ గత ఆర్థిక సంవత్సరం 2022 -23 లో బొగ్గు అమ్మకాలు, విద్యుత్ అమ్మకాల ద్వారా మొత్తం రూ.3,074 కోట్ల స్థూల లాభాలను ఆర్జించింది. కాగా, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలకు ఇతర ట్యాక్స్ చె ల్లింపుల అనంతరం రూ.2,222 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. సింగరేణి చరిత్రలోనే ఇది ఒక ఆల్ టైం రికార్డ్. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2021 -22లో సింగరేణి సాధించిన నికర లాభాలు రూ.1,227 తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరం సాధించిన లాభాలు 81 శాతం అధికం. అలాగే టర్నోవర్ కూడా 2021 22 సంవత్సరంలో సాధించిన రూ.26,585 కోట్లపై గత ఆర్థిక సంవత్సరం (2022 -23)లో సాధించిన రూ.33,065 టర్నోవర్ 24 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం(2022 -23) సింగరేణి సాధించిన టర్నోవర్ లో బొగ్గు అమ్మకం ద్వారా రూ28, 650 కోట్లు, విద్యుత్ అమ్మకం ద్వారా రూ4,415 కోట్లను గడిచింది.
గత 9 ఏళ్ల లో లాభాల్లో 430 శాతం వృద్ధి.. అమ్మకాల్లో 175 శాతం వృద్ధి :
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 2013- 14 సంవత్సరంతో పోల్చితే సింగరేణి సంస్థ లాభాల్లో అబ్బుర పరిచే విధంగా 430 శాతం వృద్ధిని సాధించడం విశేషం. 2013- 14లో సింగరేణి రూ.419 కోట్ల నికర లాభాలు సాధించగా గత ఆర్థిక సంవత్సరం రూ.2,222 కోట్లను సాధించి అత్యధిక వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో దేశంలోని వివిధ మహారత్న కంపెనీలు సాధించిన లాభాల వృద్ధి కన్నా కూడా సింగరేణి సాధించిన వృద్ధి చాలా ఎక్కువ గా ఉంది. సింగరేణి సంస్థ 430 శాతం వృద్ధితో మొదటి స్థానంలో ఉండగా.. 241 శాతం వృద్ధితో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రెండవ స్థానంలో, 114 శాతం వృద్ధితో పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ మూడో స్థానంలో, 86 శాతం వృద్ధితో కోల్ ఇండియా నాలుగవ స్థానంలో ఉంది.
గత ఏడాది సాధించిన లాభాలపై 81 శాతం వృద్ధి..
సింగరేణి సంస్థ అంతకుముందు ఏడాది (2021-22 )లో రూ.1,227 కోట్ల రూపాయల లాభాలు సాధించగా గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో రూ.2,222 కోట్ల నికర లాభాలు సాధించి 81% వృద్ధిని నమోదు చేసింది. ఈ విధంగా 2021-22 ఆర్థిక సంవత్సరం పై గత ఆర్థిక సంవత్సరంలో సాధించి లాభాల వృద్ధిలో మహారత్న కంపెనీల కన్నా సింగరేణి సంస్థ అగ్రస్థానంలో ఉంది. 62 శాతం లాభాల వృద్ధితో కోల్ ఇండియా రెండవ స్థానంలో నిలిచింది.
తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుత అభివృద్ధి సిఎండి ఎన్.శ్రీధర్
సింగరేణి సంస్థ తన 134 సంవత్సరాల చరిత్రలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాతనే అత్యద్భుత ప్రగతి సాధించిందని సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ పేర్కొన్నారు. బొగ్గు ఉత్పత్తి లో 33 శాతం వృద్ధి, బొగ్గు రవాణాలో 39 శాతం, అమ్మకాలలో 177 శాతం లాభాలలో 430 శాతం వృద్ధిని సాధించిందని ఇవి సింగరేణి చరిత్రలోనే అత్యధిక రికార్డులు అని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి థర్మల్ విద్యుత్ ఉత్పాదన ద్వారా గణనీయమైన టర్నోవర్, లాభాలు సాధించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తాము కూడాభాగస్వాములు కావాలన్న ఉద్దేశంతో సింగరేణి అధికారులు, కార్మికులు ఉద్యోగులు అంకితభావంతో పనిచేసి కంపెనీని దేశంలో అగ్రస్థానంలో నిలిపారని ఆయన అభినందనలు తెలియజేశారు. ఈ లాభాల ద్వారా సింగరేణి మరిన్ని కొత్త కొత్త ప్రాజెక్టులను చేపడుతుందన్నారు. అలాగే కార్మికులకు లాభాల్లో వాటాగా అత్యధిక బోనస్, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా నిర్దేశించిన లక్ష్యాలు సాధిస్తే రూ.4 వేల కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందన్నారు. కనుక సింగరేణీయులందరూ సమిష్టిగా కృషి చేసి లక్షాలు సాధించాలని సిఎండి పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News