Tuesday, May 7, 2024

కరోనాతో గాయకుడు ఆనంద్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

Singer Anand dead with corona in tollywood

హైదరాబాద్: టాలీవుడ్ సీనియర్ గాయకుడు జి. ఆనంద్(67) కరోనాతో కన్నుమూశాడు. ఆనంద్‌కు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆక్సిజన్ అందకపోవడంతో అతడు మృతి చెందాడు. ఐదు దశాబ్దాలుగా సినీ రంగాని సేవలు చేస్తూ వచ్చారు. 6500 పైచిలుకు ప్రదర్శనలు చేసినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా తులగమ్ గ్రామంలో జన్మించారు. ఒక వేణువు వినిపించెను, దిక్కులు చూడకు రామయ్య, విఠలా విఠలా పాండురంగా విఠలా వంటి సూపర్ హిట్ పాటలను పాడారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News