Friday, April 26, 2024

కుటుంబ కలహాలు… తనయుడిని బావిలో పడేసి… తండ్రి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Father killed son after suicide in suryapet

సూర్యాపేట: కుటుంబ కలహాలతో పాటు భర్త మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో కుమారుడిని బావిలో పడేసి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏనుబాములలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సురకంటి రామ్‌రెడ్డి(45), పద్మ(40) దంపతులకు ఇద్దరు కూమారులు ఉన్నారు. రాంరెడ్డి ఎల్‌ఐసి ఎజెంట్‌గా పని చేస్తూ కుడకుడ గ్రామంలో నివసిస్తున్నాడు. గురువారం తన సొంతూరు ఏనూబాములకు వెళ్తున్న అంటూ తన చిన్న కుమారుడు తనూజ్ రెడ్డిని బైక్‌పై తీసుకెళ్లాడు. తనయుడికి తినుబండారాలు కొనిచ్చి అనంతరం పొలం దగ్గరికి తీసుకెళ్లాడు. బావిలో కుమారుడిని పడేసి అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్‌రెడ్డిని పశువుల కాపారులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడి వచ్చి బాలుడి కోసం వెతికారు. రామ్ రెడ్డి జేబులో సూసైడ్ లేఖ ఉంది. బాలుడిని బావిలో పడేశానని లేఖలో ఉంది. బావిలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఎంత ప్రయత్నించిన మృతదేహం లభించలేదు. కుటుంబంలో కలహాలతోనే తన తనయుడిని చంపి రామ్ రెడ్డి ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. లాక్‌డౌన్ నుంచి రామ్ రెడ్డి విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయడంతో పాటు తెలిసిన వారికి అప్పులు ఇవ్వడంతో పలుమార్లు మోసపోయాడు. సంవత్సరం నుంచి రామ్ రెడ్డి ఇంట్లో గొడవలు జరుగుతుండడంతో మానసికంగా కుంగిపోయాడు. అతడిని హైదరాబాద్‌లోని మానసిక వైద్యశాలలో చికిత్స అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News