Sunday, May 5, 2024

బోరు బావిలో పడిన బాలుడు

- Advertisement -
- Advertisement -

Boy felt in bore well in rajasthan

 

జైపూర్: నాలుగేండ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిన సంఘటన రాజస్థాన్‌లోని జాలోర్ జిల్లాలో జరిగింది. బాలుడిని బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. లాచ్‌హ్రీ గ్రామానికి చెంది నాగారామ్ దేవాసీ అనే రైతు తన వ్యవసాయ పొలంలో మంగళవారం బోరు వేశాడు. నాగారామ్ తనయుడు అనిల్ ఆడుకుంటూ బోరు వద్దకు వెళ్లాడు. బోరు పైన ఉన్న వస్తువులను తీసి అందులో తొంగి చూశాడు. ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడిపోయాడు. దగ్గరలో ఉన్న వ్యక్తి గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాలుడిని బావిలో నుంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News