Monday, May 6, 2024

నిరాశకు గురయ్యా : మహ్మద్ సిరాజ్

- Advertisement -
- Advertisement -

 

దుబాయి: ట్వంటీ20 ప్రపంచకప్‌లో తలపడే జట్టులో తనకు స్థానం దక్కక పోవడం ఎంతో నిరాశకు గురి చేసిందని టీమిండి యా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్ జట్టులో తనకు స్థానం ఖాయమని భావించానని, అయి తే తన కల నెరవేరక పోవడం ఎంతో బాధకు గురి చేసిందన్నాడు. టి20 ప్రపంచకప్‌లో ఆడాలనేది నా కల. అయితే జట్టులో తన కు చోటు దక్కక పోవడంతో ఎంతో బాధపడ్డానని తెలిపాడు. కానీ వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌కప్‌లో జట్టులో స్థానం దక్కుతుందనే నమ్మకం తనకు ఇంకా మిగిలేవుందన్నాడు. ప్రస్తుతం టీమిండియాలో స్థానం సంపాదించడం అనుకున్నంత తేలిక కాదన్నాడు. ఒక్కో స్థానం కోసం ముగ్గురేసి క్రికెటర్లు పోటీ పడుతున్నారన్నా డు. ఇలాంటి స్థితిలో సులభంగా చోటు దక్కుతుందని భావించడం అత్యాశే అవుతుందన్నాడు. కాగా, ఇంగ్లండ్ పర్యటనలో తన ప్రదర్శనపై సిరాజ్ సంతృప్తి వ్యక్తం చేశాడు. కెప్టెన్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టేందుకు తీవ్రంగా శ్రమించానని వివరించాడు. రానున్న రోజుల్లో మూడు ఫార్మాట్‌లలోనూ టీమిండియాలో చోటు సంపాదించడమే లక్షంగా ముందుకు సాగుతానన్నాడు. దీని కోసం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేశాడు. ఇక ఫార్మాట్ ఏదైనా తనకు సమానమేనని, భారత్‌కు ప్రాతినిథ్యం వహించడాన్ని అరుదైన గౌరవంగా భావిస్తున్నట్టు సిరాజ్ వివరించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News