Tuesday, May 14, 2024

మిస్టరీ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

 

హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా మిస్సింగ్. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మిస్సింగ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లో చేశారు. ఈ షూటింగ్ లొకేషన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ “వాస్తవానికి గత ఏడాది ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొద్దామని అనుకున్నాం.

ఐదు రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా లాక్ డౌన్ వచ్చి పడింది. దీంతో సినిమా అలా ఆలస్యమవుతూ వచ్చింది. త్వరలోనే థియేటర్‌ల ద్వారా ‘మిస్సింగ్’ చిత్రాన్ని విడుదల చేస్తాం”అని అన్నారు. హీరో హర్ష నర్రా మాట్లాడుతూ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఇదని చెప్పారు. నిర్మాతలు భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు మాట్లాడుతూ “మిస్సింగ్ సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది. ఓలా ఓలా లాంటి పాటలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. ప్రమోషనల్ సాంగ్ కూడా ఆకట్టుకుంటుంది”అని తెలిపారు. ఈ సమావేశంలో హీరోయిన్లు మిషా నారంగ్, నికీషా రంగ్వారా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News