Saturday, April 27, 2024

ఫైనల్లో ఆరుగురు భారత బాక్సర్లు

- Advertisement -
- Advertisement -
Six Indian Boxers Reach Finals
ఆసియా యూత్ బాక్సింగ్

దుబాయి: ఇక్కడ జరుగుతున్న ఆసియా యూత్ అండ్ జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఆరుగురు బాక్సర్లు ఫైనల్‌కు చేరుకున్నారు. అగ్రశ్రేణి బాక్సర్లు వన్షాజ్, ప్రీతిలతో పాటు మొత్తం ఆరుగురు ఫైనల్లో ప్రవేశించారు. 80 కిలోల విభాగంలో విశాల్, 60 కిలోల విభాగంలో ప్రీతి దహియా, 52 కిలోల విభాగంలో సిమ్రాన్ వర్మలు ఫైనల్‌కు దూసుకెళ్లారు. పురుషుల 64 కిలోల విభాగంలో వన్షాజ్ 50 తేడాతో ఇరాన్‌కు చెందిన ఫరిది అబుల్ ఫాజిను చిత్తు చేశాడు. విశాల్ కూడా అసాధారణ ఆటతో ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్థాన్ బాక్సర్ డౌరెన్‌తో జరిగిన పోరులో విశాల్ విజయం సాధించాడు. మరోవైపు 57 కిలోల విభాగంలో ప్రీతి ఫైనల్‌కు చేరింది. ప్రీతి దహియా కూడా ఫైనల్ బెర్త్‌ను సాధించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News