Tuesday, April 30, 2024

హద్దులు దాటిన ఇంగ్లండ్ అభిమానులు

- Advertisement -
- Advertisement -
Ball thrown at Mohammed Siraj by Headingley crowd
సిరాజ్‌పై బంతితో దాడి!

లీడ్స్: టీమిండియాతో జరుగుతున్న మూడో టెస్టులో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌కు చెందిన అభిమానులు ఓవరాక్షన్‌కు దిగుతున్నారు. భారత ఆటగాళ్లను టార్గెట్ చేసుకుని దాడులకు దిగుతున్నారు. మూడో టెస్టులో ఇంగ్లండ్ అభిమానులు హద్దులు దాటిపోయారు. రెండో టెస్టు మ్యాచ్ సందర్భంగా కెఎల్.రాహుల్‌పై వాటర్ బాటిల్ మూతలు విసిరిన ఇంగ్లండ్ అభిమానులు హెడింగ్లే టెస్టులో మరింత చెలరేగి పోతున్నారు.

మూడో టెస్టు తొలి రోజు ఆటలో భారత ఆటగాడు సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకుని ఓ ఇంగ్లండ్ అభిమాని బంతిని విసిరాడు. ఇది చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిమాని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతేగాక ఆ బంతిని తిరిగి వారివైపే విసరాలని సిరాజ్‌కు సైగా చేశాడు. కోహ్లి చేసింది తప్పే అయినా అతన్ని రెచ్చగొట్టింది మాత్రం ఇంగ్లండ్ అభిమానులే అనడంలో సందేహం లేదు. ఇప్పటికైనా ఇంగ్లండ్ బోర్డు ఈ విషయంలో జోక్యం చేసుకుని అభిమానుల ఆగడాలు శ్రుతిమించ కుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే సిరీస్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News