Friday, May 3, 2024

గంజాయి స్మగ్లింగ్‌..ఒకరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

వరంగల్ క్రైం : గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని టాస్క్‌ఫోర్స్, ఆత్మకూరు పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేసి రూ.24లక్షల విలువ గల 120కిలోల గంజాయి, కారు, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ మాట్లాడుతూ ములుగు జిల్లా పందికుంట గ్రామానికి చెందిన చెక్క కుమారస్వామి జీవనోపాధి కోసం కారును కొనుగోలు చేసి కిరాయిలకు కారును నడిపించి డబ్బులను సంపాదించేవాడు. నిందితుడు కారు ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో పాటు సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు.

ఇందు కోసం నిందితుడు గత ఎనిమిది సంవత్సరాలుగా ఒడిషా రాష్ట్రంలోని కలిమెల ప్రాంతంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి దానిని పెద్ద మొత్తానికి ఇతర రాష్ట్రాల్లో విక్రయించేవాడు. నిందితుడు పలుమార్లు ఒడిషా నుండి హైదరాబాద్‌కు గంజాయిని కారులో తరలించాడు. నిందితుడు గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడే సమయంలో పలుమార్లు పోలీసులకు చిక్కడంతో పోలీసులు నిందితుడిని జైలుకు కూడా పంపించారు. నిందితుడు మహారాష్ట్ర పూణెలోని ఎరవడా జైలులో ముప్పై నెలల పాటు శిక్షణను అనుభవించాడు. నిందితుడు జైలు నుండి విడుదలైన అనంతరం తనలో ఎలాంటి మార్పు రాకపోకగా తిరిగి మరోసారి గంజాయి స్మగ్లింగ్‌కు సిద్దపడ్డాడు.

నిందితుడు ఆదివారం ప్రస్తుతం పరారీలో ఉన్న మరో నిందితుడు ఒడిషా రాష్ట్రానికి చెందిన గణేశ్ అలియాస్ గన్ను వద్ద 120కిలోల గంజాయిని కొనుగోలు చేసి వాటిని రెండు కిలోల చొప్పున ప్యాకేట్లుగా మార్చి తన కారులో రహస్యంగా భద్రపర్చి మరో నిందితుడు దుప్పటి మోహన్ అలియాస్ చింటూ సహకారంతో గంజాయిని ఏటూరునాగారం, వరంగల్, హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లుగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆత్మకూరు పోలీసులతో కలిసి సోమవారం ఉదయం ఆత్మకూర్ మండలం కటాక్షపూర్ చెరువు ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న కారును పోలీసులు ఆపి తనిఖీ చేసే క్రమంలో కారు డ్రైవర్ దుప్పటి మోహన్ తప్పించుకుపోగా ప్రధాన నిందితుడు చెక్క కుమారస్వామి తప్పించుకునే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు.

కారును తనిఖీ చేయగా కారులో గంజాయి గుర్తించిన పోలీసులు నిందితుడితో పాటు కారు, గంజాయిని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారని చెప్పారు. నిందితుడు కుమారస్వామిపై గతంలో మహబూబాబాద్, ములుగు జిల్లాలతో పాటు మహారాష్ట్రలో పలు నమోదైనాయని తెలిపారు. గంజాయి స్మగర్లను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన టాస్క్‌ఫోర్స్ ఏసీజీ జితేందర్‌రెడ్డి, ఇన్స్‌పెక్టర్లు శ్రీనివాసరావు, జనార్ధన్‌రెడ్డి, ఎస్‌ఐలు శరత్‌కుమార్, లవన్‌కుమార్, పాషా, ఏఏఓ సల్మాన్‌పాషా, హెడ్‌కానిస్టేబుళ్లు అశోక్, స్వర్ణలత, కానిస్టేబుళ్లు సురేశ్, ప్రభాకర్, మహ్మద్ పాషా, శ్యాం, కరుణాకర్, రాజు, శ్రావణ్‌కుమార్, నాగరాజులను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ.వి.రంగనాథ్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News