Sunday, April 28, 2024

ఎస్.ఎన్.డి.పి యుద్ధ్ద ప్రాతిపదికన పనులు వేగవంతం చేయాలి : సుధీర్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్: ఎస్.ఎన్ .డి.పి పనుల్లో భాగంగా యుద్ధ్దప్రాతిపాదికన పనులు వేగవంతం చేయాలని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ క్యాంపు కార్యాలయంలో ఎస్. ఎన్. డి.పి, జలమండలి అధికారులు, కాలనీవాసులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వెంకటరమణ కాలనీ, బీమానగర్ కాలనీలో పనులు రెండు, మూడు రోజుల్లో ప్రారంభించాలని పెండింగ్‌లో ఉన్న పనులు అధికారులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించి ఎలాంటి అలసత్వం లేకుండా చేయాలన్నారు.

ఎస్.ఎన్.డి.పి పనుల్లో భాగంగా జలమండలి పైపు లైన్లు ధ్వంసం జరుగుతున్నాయని, ఆ పనుల్లో ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి జాగ్రత్తలు పాటిస్తూ పనులు చేయాలన్నారు. ఎస్.ఎన్.డి.పి పనుల్లో భాగంగా అక్కడక్కడ గ్యాప్ జరుగుతుందని అవి ఇబ్బందులు తలెత్తకుండా సరిచేయాలన్నారు. ఆయాఆయా ప నుల్లో జలమండలి అధికారులను భాగస్వామ్యం చేస్తూ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. ఎల్బీనగర్ సర్కిల్ 10బి జలమండలి మేనేజర్ వినోద్ ,ఎస్.ఎన్.డి.పి అధికారులు కృష్ణయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News