Wednesday, May 8, 2024

మాజీ ఎంపి సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామచంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతతో మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు రాజకీయ ప్రముఖలు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ కు చెందిన ఆయన.. సర్పంచ్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు 70 ఏళ్ల పాటు రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి.

Also Read:ధరణి పై బిజెపి పూటకో మాట

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News