Wednesday, May 1, 2024

వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్‌కై స్పెషల్‌డ్రైవ్ చేపట్టాం

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్

Special vaccination drive for Handicapped and old mens
మనతెలంగాణ/హైదరాబాద్: వృద్ధులు, వికలాంగుల వ్యాక్సినేషన్‌కై స్పెషల్‌డ్రైవ్ చేపట్టినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదివారం బన్సీలాల్‌పేట్‌లోని వృద్ధాప్య గృహాన్ని సందర్శించి మొబైల్ వ్యాన్‌లకు పచ్చ జెండా ఊపి వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. జిహెచ్‌ఎంసి ఏరియాలో వివిధ వృద్ధాప్య గృహాల్లో ఉంటున్న వృద్ధులు, వికలాంగులకు టీకాలు వేయడానికి ఆదివారం నుంచి 24 మొబైల్ మెడికల్ వ్యాన్‌లను వినియోగిస్తున్నామన్నారు. మొబైల్ యూనిట్‌లో డాక్టర్, ఫార్మాసిస్ట్, ఎఎన్‌ఎం ఉంటారని ఆయన తెలిపారు. వృద్ధులు, వికలాంగులకు టీకాలు వేస్తున్న టీకా కేంద్రాన్ని ప్రధాన కార్యదర్శి పరిశీలించారు.

రాష్ట్రవ్యాప్తంగా 19 ఉచిత డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మూడో వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, మానవవనరులను బలోపేతం చేయడం, సామర్థ్యం పెంపొందించడం, హైఎక్స్ పోజర్ గ్రూపులకు టీకాలు వేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. అనంతరం కోఠిలోని యూనియన్ (ఆంధ్రా)బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ప్రారంభించారు. వివిధ ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టినందుకు జనరల్ మేనేజర్ కబీర్ భట్టాచార్య ఇతర బ్యాంకు అధికారులను ప్రధాన కార్యదర్శి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, ఆర్ధికశాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్ రోస్, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News