Tuesday, May 21, 2024

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్

- Advertisement -
- Advertisement -

యాంకర్ శ్రీముఖి, సింగర్ మనో, నటులు రాజా రవీంద్ర, భరణి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా క్రేజీ అంకుల్స్. ఈ సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్స్, గ్రీన్ మెట్రో మూవీస్, శ్రీవాస్ 2 క్రియేటివ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచేసింది. ఈ కామెడీ రైడ్ ఆగస్టులో థియేటర్స్‌లో విడుదల కానుంది. ‘క్రేజీ అంకుల్’ టైటిల్ లిరిక్ల్ సాంగ్‌ని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీముఖి మాట్లాడుతూ థియేటర్స్‌లో చూడాల్సిన చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండ హిట్ అవుతుంది అన్నారు. నిర్మాత శ్రేయాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ హెల్దీ కామెడీ సినిమాలు చేద్దామని క్రేజీ అంకుల్స్ చేశాము. ఈ ఏడాది సంక్రాంతికే రిలీజ్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే పెద్ద పెద్ద సినిమాలు విడుదల అవుతుండటంతో రిలీజ్‌ను వాయిదా వేశాం. ఆ తర్వాత మేలో విడుదల చేద్దాం అనుకున్నాం. కరోనా వచ్చింది. ఇప్పుడు ఈ సినిమాను ఆగస్టులో విడుదల చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు శ్రీవాస్, సంగీత దర్శకుడు రఘు కుంచె, చిత్ర నిర్మాత బొడ్డు అశోక్, గీత రచయిత కాసర్ల శ్యామ్, రచయిత డార్లింగ్ సామీ, భరణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News