- Advertisement -
హైదరాబాద్: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిఎం అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ప్లాంట్లో చిక్కుకున్న వారు క్షేమంగా బయటకు తిరిగిరావాలని కెసిఆర్ కోరుకున్నారు. ప్లాంట్ వద్ద పరిస్థతి సమీక్షిస్తున్న మంత్రి జగదీష్ రెడ్డి, సిఎండి ప్రభాకర్ రావుతో ముఖ్యమంత్రి మాట్లాడారు. శ్రీశైలం పవర్హౌస్ సహాయక చర్యలను పర్యవేక్షించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో షాట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి 10.30 గంటలకు భారీ ప్రమాదం అగ్ని చోటుచేసుకుంది. ఘటనాస్థలిలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి
Srisailam Power Plant Fire Accident Updates
- Advertisement -