- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కోవిడ్ కేసులు 30లక్షలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 68,898 కొత్త కోవిడ్-19 కేసులు, 983 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారత్ లో ప్రస్తుతం 6,92,028 యాక్టివ్ కేసులుండగా.. ఇప్పటివరకు 21,58,947 నయమై కోలుకున్నారు. దేశవ్యాప్తంగా 54,849మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది. నిన్న పరీక్షించిన 8,05,985 మంది బాధితులు నమూనాలతో సహా ఆగస్టు 20 వరకు పరీక్షించిన మొత్తం టెస్టుల సంఖ్య 3,34,67,237కు చేరిందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) తెలిపింది.
68898 Covid 19 cases and 983 deaths reported in India
- Advertisement -