- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు లక్షకు చేరువవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1967 కేసులు 8మంది మృతి చెందినట్టు వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 99,391కి చేరుకున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాలు 737కి పెరిగాయి. ప్రస్తుతం 21,687 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 76,967 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. గడిచి 24గంటల్లో 1,781 మంది కరోనా రోగులు డిశ్చార్జ్ అయ్యారు. కొత్త కేసుల్లో హైదరాబాద్ లో 473, రంగారెడ్డిలో 202, మేడ్చల్ 170 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. అటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
1967 new covid 19 cases reported in telangana
- Advertisement -