Tuesday, April 30, 2024

ఎస్టీపీల నిర్మాణం వేగవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

మూడు షిప్టులో పనులు జరగాలి
అక్టోబర్ నాటికి పూర్తి కావాలి: ఎండీ దానకిషోర్

మన తెలంగాణ,సిటీబ్యూరో: సీవరేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని జలమండలి ఎండీ దానకిషోర్ పేర్కొన్నారు. నగరంలో 100శాతం మురుగునీటి శుద్ది లక్షంగా రూ.3800 కోట్లతో 31 కొత్త ఎస్టీపీల నిర్మాణాన్ని జలమండలి ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈపనుల పురోగతిపై బుధవారం జలమండలి ప్రధాన కార్యాలయంలో అధికారులు నిర్మాణ సంస్దల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. అన్ని ఎస్టీపీల నిర్మాణ పురోగతిని విడివిడిగా సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ నాటికి ఎస్టీపీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, ఈమేరకు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని ఎస్టీపీల వద్ద మూడు షిప్టులో పనులు జరిగేలా చూడాలన, రాత్రి వేళల్లో పనులు జరుగుతున్నప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

కార్మికుల భద్రతకు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే, ప్రతి ఎస్టీపీ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఎస్టీపీల నిర్మాణంలో కీలకమైన ఎస్బీఆర్( సీక్వెన్షల్ బ్యాచ్ రియాక్టర్), సీసీటీ( క్లోరిన్ కాంటాక్ట్ ట్యాంక్) తదితర పనులను ఏకకాలంలో జరపడం ద్వారా నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని నిర్మాణ సంస్దలకు సూచించారు. నిర్మాణాలు జరుగుతున్న ప్రదేశాల్లో చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో జలమండలి ఈడీ డా. ఎం. సత్యనారాయణ, ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్‌బాబు, ఎస్టీపీల సీజీఎంలు, నిర్మాణ సంస్దల ప్రతిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News