- Advertisement -
ఢిల్లీ : ఢిల్లీలోని ఓ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ సర్వీస్ రివాల్వర్తో తనను తాను కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. తుపాకీ తూటా తగిలి ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఇస్ట్ ఢిల్లీలోని పాండవ్నగర్ పోలీస్స్టేషన్లో చోటుచేసుకుంది. విధులు నిర్వహిస్తున్న క్రమంలో ఎస్సై రాహుల్ సింగ్ స్టేషన్ ఆవరణలోనే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు మాత్రం తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొంటున్నారు. 2017లో రాహూల్ సింగ్ (31) పాండవ్నగర్ పోలీస్స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. నాలుగేళ్లుగా ఒకే స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ ఆయన శాంతిభద్రతలు పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -