Monday, May 6, 2024

రొమాంటిక్ డ్రామా షురూ

- Advertisement -
- Advertisement -

‘సమ్మోహనం’, ‘వి’ చిత్రాల తర్వాత హీరో సుధీర్‌బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్‌లో మూడో చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా… మైత్రి మూవీమేకర్స్ రవిశంకర్ కెమెరా స్విచాన్ చేశారు. నిర్మాత దిల్‌రాజు గౌరవ దర్శకత్వం వహించారు. వెంకీ కుడుముల స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. గాజులపల్లి సుధీర్‌బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై మహేంద్రబాబు, కిరణ్ బల్లపల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించే ఈ చిత్రం మార్చి నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః పి.జి.విందా, సంగీతంః వివేక్ సాగర్, ఎడిటర్‌ః మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్‌ః రవీందర్, సాహిత్యంః సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్య శాస్త్రి.

Sudheer babu and Indraganti’s new movie launch

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News