- Advertisement -
టోక్యో : కరోనా బారిన పడిన జపాన్కు చెందిన ఓ సుమో రెజ్లర్ మృత్యువాత పడ్డాడు. 28 ఏళ్ల షోబుషి కరోనా మహమ్మరి కోరల్లో చిక్కుకుని తుది శ్వాస విడిచాడు. ఈ విషయాన్ని జపాన్ సుమో రెజ్లింగ్ సంఘం అదికారికంగా ప్రకటించింది. ఇక, కరోనా వల్ల ఓ సుమో రెజ్లర్ మరణించడం ఇదే ప్రథమం. రెజ్లర్ షోబుషి నెల రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు. అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. అతనికి కరోనా సోకడంతో ఆసుపత్రిలోనే ఉంచి చికిత్స అందించారు. అయితే వ్యాధి ముదరడంతో షోబుషి ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతిపై పలువురు సుమో రెజ్లర్లు సంతాపం వ్యక్తం చేశారు.
- Advertisement -