- Advertisement -
ముంబై: పేలవమైన ఫామ్ వల్లే సురేశ్ రైనా టీమిండియాలో చోటు కోల్పోయాడని బిసిసిఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సీనియర్లపై తాను చిన్నచూపు చూశానని వచ్చిన వార్తల్లో నిజం లేదన్నాడు. ప్రతి క్రికెటర్కు అవకాశాలు కల్పించానని, కొందరూ దీన్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో స్థానాన్ని శాశ్వతం చేసుకున్నారని వివరించాడు. ఇక, రైనా లాంటి సీనియర్ క్రికెటర్కు కూడా పలు అవకాశాలు ఇచ్చామని, అయితే దాన్ని అతను సద్వినియోగం చేసుకోలేదన్నాడు. అంతేగాక దేశవాళి క్రికెట్లో, ఐపిఎల్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమయ్యాడన్నాడు. అందుకే ఫామ్ను దృష్టిలో పెట్టుకుని రైనాకు తిరిగి టీమిండియాలో చోటు కల్పించలేక పోయామని ప్రసాద్ పేర్కొన్నాడు.
- Advertisement -