- Advertisement -
న్యూఢిల్లీ: వివిధ క్రీడల్లో రాణిస్తున్న క్రీడాకారులు, కోచ్లకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడా అందించే క్రీడా పురస్కారా నామినేషన్లను ఈ ఏడాది ఈ మెయిల్ ద్వారా స్వీకరిస్తున్నట్టు కేంద్ర క్రీడ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించింది. అంతేగాక ఈ ఏడాది ఖేల్ రత్న తో పాటు ఇతర అవార్డుల సెలెక్షన్ ప్రక్రియను కూడా ఆల్లైన్ ద్వారానే నిర్వహిస్తామని తెలిపింది. సాధారణంగా నామిషేన్ల స్వీకరణ కార్యక్రమం ఏప్రిల్లోనే ప్రారంభమవుతోంది. అయితే దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన నేపథ్యంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. దీంతో ఆన్లైన్ ద్వారా నామినేషన్లను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, నామినేషన్ల గడువు జూన్ మూడో ముగియనుంది.
- Advertisement -