Sunday, May 5, 2024

స్టార్ కపుల్ మరోసారి తెరపైకి…

- Advertisement -
- Advertisement -

suriya and jyothika share screen again

కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య,జ్యోతికల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. వీరిద్దరి సినిమాలు మొదటి నుండి తెలుగులోకి అనువాదమవుతూనే ఉన్నాయి. అయితే ఈ ఇద్దరూ కలిసి పలు సూపర్ హిట్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అలా ఇద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉన్నారు. ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ కపుల్‌గా పాపులర్ అయ్యారు. అయితే సూర్యతో పెళ్లి తర్వాత జ్యోతిక ఇతర హీరోలతో సినిమాలు చేయడం తగ్గించింది. అయితే తాజాగా మరోసారి ఈ జంట కలిసి నటించే సూచనలు కనిపిస్తున్నాయని తెలిసింది. ఇద్దరూ సరైన స్క్రిప్ట్ గురించి ఎదురు చూస్తున్నారట.

అయితే తాజా సమాచారం ప్రకారం… సూర్య, జ్యోతికలు ‘నారింజ మిఠాయి’ సినిమా తెరకెక్కించిన హలితా షమిమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ‘నారింజ మిఠాయి’ అనేది తమిళ ‘సిల్లు కరుపట్టి’ అనే సినిమాకు తెలుగు డబ్బింగ్. ఇటీవలే ఆహా ఓటిటిలో విడుదలైంది. అయితే సిల్లు కరుపట్టి సినిమాకు సూర్య సమర్పకుడు. ఆ సినిమా సమయంలో హలితా వర్క్ నచ్చి ఓ కథ రెడీ చేయమని చెప్పాడట. అందులో తన భార్య జ్యోతికకు కూడా అవకాశం ఉండాలని చెప్పినట్లు తెలిసింది. తాజాగా డైరెక్టర్ హలితా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ప్రస్తుతం హలితా సూర్య కపుల్ కోసం స్క్రిప్ట్ తయారు చేస్తోందట. ఇక తాజాగా ఆమె తెరకెక్కించిన ‘ఆలేయ్’ సినిమా ఈనెల 12న విడుదల కాబోతున్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News