- Advertisement -
తిరువనంతపురం: తౌక్టే తుఫాన్ తీరాన్ని తాకుతుండడంతో ఆరేబియ సముద్రంలో అలలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్ణాటక తీరాల్లో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో గంటకు 120 నుంచి 170 కిమీ వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తీర ప్రాంతాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గోవా తీరంలో వాతావరణం పూర్తిగా మారిపోయిన దృశ్యాలను చూడవచ్చు.
#WATCH | Goa's Panaji witness the spell of Cyclone #Tauktae pic.twitter.com/2gNU75Uzyq
— ANI (@ANI) May 16, 2021
- Advertisement -