Saturday, May 4, 2024

దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో భారత్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

జోహన్నెస్ బర్గ్: దక్షిణాఫ్రికాపై తొలి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందు బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత్‌ కు 117 పరుగుల టార్గెట్ ఇచ్చింది. రన్ ఛేజింగ్ కి దిగిన భారత్ కు రెండు వికెట్లు కోల్పోయింది. రుతురాజ్ గైక్వాడ్ (05) పరుగులు చేసి ఔటయ్యాడు. మియాన్ ముల్డర్ వేసిన 3.4 ఓవర్ కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ముందు అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. దక్షిణాఫ్రికా డిఆర్ఎస్ కు వెళ్లింది. తర్వాత శ్రేయస్ అయ్యర్ 45 బంతుల్లో (52) పరుగులు చేసి వికెట్ కోల్పోయాడు. 111 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 16.4 ఓవర్లకు 117 పరుగులు చేసిన టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. సాయి సుదర్శన్ (55), తిలక్ వర్మ(01) నాటౌట్ గా నిలిచారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News