Tuesday, May 7, 2024

విరాట్ ఔట్…. భారత్ 162/3

- Advertisement -
- Advertisement -

 

హమీల్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మూడు వెన్డేలో సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత్ 30 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 162 పరుగులతో ఆడుతోంది. పృద్వీషా 20 పరుగులు చేసి గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో లాథమ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అగర్వాల్ 32 పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో బ్లండెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.  భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 పరుగులు చేసి సోధీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. విరాట్, శ్రేయస్ మూడో వికెట్ పై 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (47), రాహుల్ (3) పరుగులతో ఉన్నారు.

 

Team india Loss 3 Wickets for 162 Runs in Ind vs NZ
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News