Sunday, April 28, 2024

రాహుల్ హాఫ్ సెంచరీ… టీమిండియా 269/4

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ రెండో రోజు టీమిండియా 60 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 269 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికి భారత జట్టు 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. శ్రేయస్ అయ్యర్ 35 పరుగులు చేసి రెహన్ అహ్మాద్ బౌలింగ్‌లో టామ్ హర్ట్‌లేకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. కెల్ రాహుల్ హాఫ్ సెంచరీతో కదంతొక్కాడు. భారత బ్యాట్స్‌మెన్లు యశస్వి జైస్వాల్ (80), శ్రేయస్ అయ్యర్(35), రోహిత్ శర్మ(24), శుభ్‌మన్ గిల్(23) పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో కెల్ రాహుల్ (83), రవీంద్ర జడేజా(18) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లే, జాక్ లీచ్, రెహాన్ అహ్మాద్, జోయ్ రూట్ తలో ఒక వికెట్ తీశారు. ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News