Wednesday, May 8, 2024

రోహిత్, జైస్వాల్ ఔట్… టీమిండియా 30/2

- Advertisement -
- Advertisement -

విశాఖపట్న: డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ మూడో రోజు టీమిండియా 9 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 30 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇప్పటికే భారత జట్టు 173 పరుగుల ఆధిక్యంలో ఉంది. రోహిత్ శర్మ 13 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. యశస్వి జైస్వాల్ 17 పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో జోయ్ రూట్‌కు క్యాచ్ ఇచ్చి రెండో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఒక పరుగు తేడాతోనే ఓపెనర్లు ఔట్ కావడంతో భారత జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో శుభ్‌మన్ గిల్(0), శ్రేయస్ అయ్యర్(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

భారత్ తొలి ఇన్నింగ్స్: 396
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 253

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News