Friday, May 3, 2024

ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ

- Advertisement -
- Advertisement -

Telangana CM writes to PM Modi over heavy Rains

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీకి గురువారం సిఎం కెసిఆర్ లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయినందున సాయం అందించాలని కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల వల్ల రూ.5వేల కోట్లకుపైగా నష్టం జరిగిందని సిఎం తెలిపారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ. 1,350కోట్లు అందించాలని ప్రధానికి రాసిన లేఖలో సిఎం కోరారు. తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు, వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి గురువారం ప్రగతి భవన్‌లో అత్యవసర ఉన్నతస్థాయి స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల‌పై మంత్రులు, అధికారులతో కెసిఆర్ చర్చించారు.

Telangana CM writes to PM Modi over heavy Rains

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News