Sunday, April 28, 2024

నేడు లోక్‌సభ అభ్యర్థుల జాబితా?

- Advertisement -
- Advertisement -

నేడు అభ్యర్థుల జాబితా

తొలుత 14, తర్వాత 3 సీట్లకు
అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్
రాహుల్ పోటీపై రాని స్పష్టత

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో పోటీ చేయనున్న కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల్లో కొందరిని ఆ పార్టీ అధిష్ఠానం గురువారం ప్రకటించే అవకాశం ఉంది. దిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకోనుంది. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న కాంగ్రెస్ నాయకత్వం అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీ మేరకు ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై బుధవారం హస్తినలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది.

ఈ భేటీకి పిసిసి అధ్యక్షుడి హోదాలో సిఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్సీ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీలో చర్చించిన అభ్యర్థులు జాబితాతో దీపాదాస్ మున్షీ ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. శాసనసభ ఎన్నికల సమయంలో పార్లమెంటు అభ్యర్థులుగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకు ఆయా నియోజకవర్గాలను వారికే ఇవ్వాలని అధిష్ఠానం సూచించినట్లు తెలు స్తోంది. రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఊపు మీదున్న కాంగ్రెస్ పార్లమెంటు ఎన్నికల్లోనూ వీలైనన్నీ ఎక్కువ సీట్లు దక్కించుకునేలా ప్రణాళి కలు రచిస్తోంది.

ఇందులో భాగంగానే అభ్యర్థుల ఎంపికలోనూ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్యతో పాటు స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేసిన ఇందిర పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. నాగర్ కర్నూల్ నుంచి మాజీ ఎంపీ మల్లు రవి పేరును దాదాపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మహబూబాబాద్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఖమ్మం సీటును మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సతీమణి నందిని, మంత్రి తుమ్మల కుమారుడు యుగంధర్ ఆశిస్తున్నారు.

మరోవైపు జిల్లాలో ఓ సామాజికవర్గానికి ఓట్లు ఎక్కువ ఉన్నందున రాజేంద్ర ప్రసాద్ అనే నేత పేరునూ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి లేదా ఎంఎల్‌సి జీవన్‌రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ లేదంటే ఓ మాజీ ఎంపిని బరిలోకి దించవచ్చని తెలుస్తోంది. నిజామాబాద్ నుంచి మాజీ ఎంఎల్‌ఎ ఇరా వత్రి అనిల్ కుమార్, ఎంఎల్‌సి జీవన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మెదక్ నుంచి నీలం మధుకు టికెట్ ఇవ్వాలని పార్టీ వర్గాలు యోచిస్తున్న ట్లు సమాచారం. జహీరాబాద్ టికెట్ మాజీ ఎంపి సురేష్ షెట్కర్‌కే దక్కే అవకాశం పుష్కలంగా ఉంది. ఇక్కడి నుంచి ఉజ్వల రెడ్డి సిద్ధా రెడ్డీ టికెట్ ఆశిస్తున్నారు.

సికింద్రాబాద్ నుంచి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లేదంటే ఆయన భార్య శ్రీదేవికి గానీ టికెట్ ఇవ్వాలని పార్టీ యోచిస్తుండగా గౌడ సామాజిక వర్గానికి చెందిన మరో నాయకుడు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని రాష్ట్ర నాయకత్వం అంటోంది. చేవెళ్ల నుంచి పట్నం సునీత మహేందర్‌రెడ్డికే టికెట్ వచ్చే అవకాశం ఉంది. మహబూబ్‌నగర్ నుంచి ఎఐసిసి కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి నల్గొండ నుంచి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పటేల్ రమేశ్‌రెడ్డిని కానీ జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించే అవకాశం ఉంది. భువనగిరి నుంచి పిసిసి ఉపాధ్యక్షుడు చామల కిరణ్ రెడ్డి పేరుతో పాటు కోమటిరెడ్డి సోదరుడు మోహన్‌రెడ్డి కుమారుడు సూర్యపవన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది.

అదే విధంగా మల్కాజిగిరి నుంచి బిసి నాయకుడిని బరిలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. ఆదిలా బాద్ నుంచి మాజీ ఎంపి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండడంతో వేచి చూసే ధోరణితో ఉన్నారు. హైదరాబాద్ నుంచి మస్కతి డెయిరీ యజమాని కి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలోని దాదాపు అన్ని స్థానాలకు సంబంధించి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, సిద్ధం చేసిన జాబితా పై కేంద్ర ఎన్నికల కమిటీలో చర్చించి, వివాదం లేని సీట్లకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. గురువారం కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం తర్వాత కనీసం 14 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి కసరత్తు చేస్తున్న రాష్ట్ర నాయకత్వం వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రతిపాదించనుం దని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రాహుల్ పోటీపై రాని స్పష్టత
కాగా, ఈ నెల రెండో వారంలో పార్లమెంట్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే అభ్యర్థుల ప్రకటన చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను దక్కించుకోవాల ని రాష్ట్ర నేతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని తెలంగాణ నుండి పోటీ చేయాలని కూడా కోరారు. రాహుల్ గాంధీ తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఎంపి సీట్లలో ఏదో ఒక స్థానం నుండి బరిలోకి దింపాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. అయితే ఈ విషయమై రాహుల్ గాంధీ నుండి స్పష్టత రావాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News