- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1504 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందినట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసులు సంఖ్య 2.35 లక్షలకు చేరుకోగా 1324 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 2.16 లక్షల మంది కోలుకోగా 17,979 మంది చికిత్స తీసుకుంటున్నారు. గత 24 గంటల్లో 41,962 మందికి కరోనా టెస్టులు చేయగా మొత్తం టెస్టుల సంఖ్య 41.97 లక్షలకు చేరుకుంది.
- Advertisement -