- Advertisement -
లక్నో: ఓ మహిళను హత్య చేసి మొండెం నుంచి తలను వేరు చేసి అనంతరం మృతదేహాన్ని 15 ముక్కలుగా నరికిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మీరట్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మీరట్లోని శ్మశాన వాటిక సమీపంలో తలలేని ముక్కలు ముక్కలుగా నరికి మహిళ మొండెం చెత్త కుప్పలో కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మాంసపు ముద్దలను వీధి కుక్కలు పీక్కు తింటున్నాయి. ఎస్పి అఖిలేష్ నారాయణ్ సింగ్ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మహిళను చంపిన అనంతరం మృతదేహం గుర్తించకుండా మృతదేహం నుంచి తలను వేరు చేశారని ఎస్పి తెలిపాడు. మహిళ వయసు 30 ఏళ్లు ఉంటుందని, స్థానికంగా అమర్చిన సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు. మహిళ తల ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
- Advertisement -