Thursday, May 2, 2024

మోసపోతే గోస పడుతం

- Advertisement -
- Advertisement -

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 –23 నాటికి 15.7% వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ. 72,815 కోట్లు అందించారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా తాగు, సాగునీరు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దే. రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు, ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డుల కంప్యూటరీకరణ లాంటి విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సాక్షీభూతంగా నిలిచింది. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండల్లా మారి, భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద కూడా పెరిగింది.

1952 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అందులోనూ ఆంధ్రా కాంగ్రెస్ నేతలు తెలంగాణకు అన్యాయం చేసి, అభివృద్ధిని పట్టించుకోక గాలికొదిలేశారు. తెలంగాణ నాయకులకే కనీస ప్రాధాన్యం లేని ఆ సమయంలో ఇక్కడి ప్రజల కష్టాల గురించి చెప్పనక్కర్లేదు. తాగునీళ్లు లేవు, సాగునీళ్లు లేవు.. వానలుపడితే అంతంత మాత్రం పంటలు.. లేదంటే కరువు. కనీసం పశువులు తాగడానికి కూడా నీళ్లులేని పరిస్థితి. వ్యవసాయం గిట్టుబాటు గాక, బ్యాంకుల్లో, బయట వడ్డీకి తెచ్చిన డబ్బులకు మిత్తీలు కట్టలేక వేలాది మంది రైతులు పొలం గట్టున ఉండే తుమ్మ చెట్టుకో, వేప చెట్టుకో ఉరిపోసుకునే దయనీయ పరిస్థితి. ‘పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసె’ అంటూ కవులు నాటి స్థితిని పాటలుగా పాడారు.
కాంగ్రెస్ పాలకులు తెలంగాణకు నదీ జలాల్లో, నిధుల కేటాయింపుల్లో, నియామకాల్లో తీవ్ర అన్యాయం చేశారు. ఏండ్ల తరబడి ఆంధ్ర పాలకుల చేతిలో మోసపోయిన తెలంగాణ ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలని భావించారు. అక్కడి నుంచి పుట్టిందే తొలి దశ తెలంగాణ పోరాటం. ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు కానీ.. ఆంధ్ర పాలకులు తెలంగాణను ప్రత్యేక రాష్ట్రం చేయనీయలేదు. 2001లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని తన భుజాలకెత్తుకున్న కెసిఆర్.. గాంధేయమార్గంలో మలిదశ తెలంగాణ ఉద్యమం చేసి, ‘తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో’ అని చావు నోట్లో తలబెట్టి ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కలను సాకారం చేశారు. తెచ్చిన తెలంగాణను ఎవరి చేతిలో పెట్టినా.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేరబోవని భావించే ఉద్యమ నాయకుడే.. ముఖ్యమంత్రిగా పదేండ్లలో తెలంగాణను ప్రగతిలో పరుగులు పెట్టించారు. ఎన్నికల కోసం ఎదురు చూసిన కాంగ్రెస్, బిజెపి రాజకీయ నిరుద్యోగులు అబద్ధాల ప్రచారం, కుట్రలు, అలవికానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారు. తెలంగాణ ఓటర్లు వారి మాటలు నమ్మితే మోసపోయే ప్రమాదం ఉన్నది.గత పదేండ్ల పాలనను ఒక్కసారి నెమరు వేసుకొని.. ఆలోచించి ఓట్లు వేయాల్సిన సందర్భం వచ్చింది.

భారత దేశానికి ఇవాళ తెలంగాణ ఒక అభివృద్ధి మాడల్. సిఎం కెసిఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరించిన కెసిఆర్.. బీడువారిన భూములను పచ్చని పంట పొలాలుగా తీర్చిదిద్దారు. నేటి తెలంగాణ శాంతి సామరస్యానికి ప్రతీక. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క మతకల్లోలం కూడా జరగలేదు. అభివృద్ధి, సంక్షేమం మధ్య సమతుల్యం పాటిస్తూ సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ ముందుకు వెళ్తున్నది. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండో స్థానంలో ఉండేది. 2700 మెగావాట్ల విద్యుత్తు కొరత ఉండేది. విద్యుత్తు లేక పరిశ్రమలను వారంలో రెండు రోజుల పాటు మూసివేసేవారు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉండేది.

సిఎం కెసిఆర్ సమూలమైన సంస్కరణల ద్వారా పూర్తిగా ఆ పరిస్థితులను మార్చివేశారు. విద్యుత్తు మిగులు సాధించాం. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రెండో స్థానానికి చేరింది. గత పదేండ్లలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 118.2% పెరిగింది. తెలంగాణ జిఎస్‌డిపి జాతీయ సగటుకు మించి 155.7 శాతం పెరిగింది. జిఎస్‌డిపిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నది. తెలంగాణ ఏర్పాటయ్యే సమయానికి రూ. 1,12,162 ఉన్న తలసరి ఆదాయం 2022 –23 నాటికి రూ. 3,14,732 కి పెరిగింది. తలసరి ఆదాయం పెరుగుదలలో ఇతర రాష్ట్రాలకు మించి దూసుకెళ్తున్నది. ఎన్‌ఎఫ్ హెచ్‌ఎస్ 2019–21 ప్రకారం సమాన ఆదాయ పంపిణీలో తెలంగాణ నెంబర్‌వన్‌గా ఉన్నది.

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 –23 నాటికి 15.7% వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి రూ.10 వేల చొప్పున ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతులకు రూ. 72,815 కోట్లు అందించారు. ఎక్కడా లేని విధంగా రైతులకు ఉచితంగా తాగు, సాగునీరు అందిస్తున్న ఘనత సిఎం కెసిఆర్‌దే. రైతాంగానికి 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్తు, ధరణి పోర్టల్ ద్వారా భూరికార్డుల కంప్యూటరీకరణ లాంటి విప్లవాత్మక మార్పులకు తెలంగాణ సాక్షీభూతంగా నిలిచింది. మిషన్ కాకతీయ కింద చెరువులు మరమ్మతు చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్రంలో చెరువులు నిండుకుండల్లా మారి, భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మత్స్య సంపద కూడా పెరిగింది. ఒకప్పుడు సాగు విస్తీర్ణం 1.31 లక్షల ఎకరాలు ఉంటే.. ఇప్పుడు 2 కోట్ల పైచిలుకు ఎకరాలకు పెరిగింది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది తెలంగాణ.

2014లో రూ. 62 వేల కోట్లుగా ఉన్న రాష్ట్ర బడ్జెట్ ఇప్పుడు రూ.2 లక్షల 94 వేల కోట్లకు చేరుకుంది. తాగునీటిపై రాష్ట్ర ప్రభుత్వం రూ. 36 వేల కోట్లు ఖర్చు చేసింది. మిషన్ భగీరథ ద్వారా ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ కల్పించారు. విద్యుత్తు రంగంలో రూ. 38 వేల కోట్లు ఖర్చు చేశారు. 2014లో 7,778 మెగా వాట్ల విద్యుత్తు ఉత్పత్తయ్యేది. ఇప్పుడది 18,453 మెగా వాట్లను ఉత్పత్తి చేసే సామర్థ్యానికి చేరుకున్నది. తలసరి విద్యుత్తు వినియోగం 2,126 యూనిట్లకు చేరింది. ఇది దేశంలోనే అత్యధికం. 2014 నుంచి ఈ ఏడాది జనవరి వరకు రూ. 3.31 లక్షల కోట్ల పెట్టుబడులతో 22,100 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. తద్వారా 22 లక్షల 36 వేల పరోక్ష ఉద్యోగాలను సృష్టించారు. 2014 లో రాష్ట్రం నుంచి రూ. 57 వేల కోట్ల విలువైన ఐటి ఉత్పత్తులు ఎగుమతవ్వగా.. ఇప్పుడు రూ.1.83 లక్షలకు చేరాయి.

యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి బహుళజాతి కంపెనీలు సైతం తమ యూనిట్లను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయి. సిఎం కెసిఆర్ దూరదృష్టితోనే ఇదంతా సాధ్యమైంది. రూ. 11 వేల కోట్లకు పైగా ఆసరా పథకం కింద 44 లక్షల మందికి పైగా అర్హులకు పింఛన్లు అందించారు. విద్యారంగంలో రంగం లో సమూల మార్పులు తీసుకు వచ్చారు. 10 వేల మెడికల్ సీట్లను పెంచారు. ప్రతీ జిల్లా దవాఖానాకు అనుబంధంగా మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుంది. ఉద్యమంలో చొరబడటం.. చేతిలోకి తీసుకోవడం.. ద్రోహం చేయడం 70 ఏండ్ల పాటు ఈ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో ఇదే కాంగ్రెస్ పోషించిన పాత్ర. ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా తెలంగాణకు చివరి దాక కట్టుబడిన దాఖలా లేదు. రాష్ట్ర సాధనకు రోడ్ మ్యాప్ వేసిన నాయకుడు అంతకన్నా లేడు. ఎవరో రేపిన ఉద్యమ వేడిని ఎన్నికల పెనంగా వాడేసుకోవడం, అధికారం దక్కగానే మాట మార్చేయడం తెలంగాణ కాంగ్రెస్ చరిత్ర అంతా ఇంతే!

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అటు దేశంలో, ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు. తెలంగాణలో బిఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నది. ఇప్పటికే దేశంలో, రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్‌ను వద్దనుకుని పక్కనపెట్టారు. అలాంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వొద్దని, కేవలం మూడు గంటలు ఇస్తే సరిపోతుందని వ్యాఖ్యానించడం ఆ పార్టీ రైతు వ్యతిరేకతను బయటపెట్టింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి గత పదేండ్లలో కెసిఆర్ చేసిన అభివృద్ధి చూసి ఓర్వలేక ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు చేస్తున్నది. కర్నాటక వాపును చూసుకొని బలుపు అని మురిసిపోతున్న కాంగ్రెస్ నాయకులకు.. కర్నాటక పరిస్థితులే షాకు గురి చేస్తున్నాయి.
ఇటీవల కర్నాటకలో బిజెపి మీదున్న వ్యతిరేకత పుణ్యమాని గెలిచింది. బిజెపి మతోన్మాద విధానాలు, అలవిమాలిన అవినీతితో విసిగిపోయిన కన్నడిగులు కాంగ్రెస్‌కు ఓటేశారు. తమ పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని వారు తెలుసుకునేందుకు ఎంతో సమయం పట్టలేదు.

కర్నాటకలో తాజా పరిణామాలతో కాంగ్రెస్ డొల్లతనం బయటపడింది. కుర్చీలాటతో, సిగపట్లతో పరువు బజారుకెక్కింది. బుజ్జగింపులు, బెదిరింపులు నడుస్తున్నాయి. ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర కలిగిన పార్టీలో ఏదైనా జరగొచ్చునని చెప్పుకొంటున్నారు కన్నడిగులు. కాంగ్రెస్ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా అనాదిగా జరిగే తంతు ఇదే. సీట్ల కేటాయింపు దగ్గరి నుంచి సిఎం ఎంపిక దాకా అంతా కుమ్ములాటలమయమే. ముఠా తగాదాలతో కాలం వెళ్లదీయడమే వారు చేసే పని. ఏ రాష్ట్రంలోనూ ఏ ముఖ్యమంత్రీ ఐదేండ్లూ పదవీకాలం పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు. సిఎంలను గద్దె దింపేందుకు అల్లర్లు సృష్టించిన హీనచరిత్ర కాంగ్రెస్‌ది. అలాంటి కాంగ్రెస్ ఇప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని అలవికాని హామీలతో మభ్యపెడుతున్నది. ప్రజలారా ఆలోచించండి మోసపోతే.. గోసపడుతం.

బచ్చు శ్రీనివాస్
93483 11117

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News