Sunday, May 12, 2024

అత్యాచారయత్నం…. మర్మాంగాన్ని కోసుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితురాలు

- Advertisement -
- Advertisement -

లక్నో: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కౌశాంబి జిల్లాలో ఓ మహిళపై యువకుడు అత్యాచారం చేస్తుండగా అతడి మర్మాంగాన్ని కత్తితో కోసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ మహిళ వద్ద యువకుడు పని చేస్తున్నాడు. సదరు మహిళ భర్త సౌదీ అరేబియాలో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై యువకుడు అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అతడిని మాటల్లో పెట్టి వంటి గదికి వెళ్లి కత్తి తీసుకొని వచ్చింది. అతడితో చనువుగా ఉన్నట్టు నటించి అతడి మర్మాంగాన్ని కట్ చేసి సంచిలో వేసుకుంది. సంచితో స్థానిక పోలీస్ స్టేషన్‌లో అతడిపై మహిళ ఫిర్యాదు చేసింది. యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరువైపుల పోలీసులు ఫిర్యాదులు తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అతడి జననాంగం మళ్లీ యదాస్థితికి వచ్చే అవకాశం లేదని వైద్యులు తెలిపినట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News